జగన్ వైపు... జనం చూపు..!
ఇప్పటికైనా కాంగ్రెస్ కళ్ళు తెరవాలి.నూటపాతికేళ్ళ చరిత్ర గల పార్టీకి దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పుట్టగతుల్లెకుండా పోవడమేంటి..? రాహుల్ తప్ప దిక్కులేదని కాంగ్రెస్ వృద్ధ జంబూకాలు కూడా నొక్కి వాక్కాణిస్తున్న తరుణంలో ఆ యువ నాయకుడి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. యూపిలో
రెండోసారి ఆయనకు శృంగభంగం తప్పలేదు. నెహ్రు నాటి నాయకత్వ లక్షణాలు ఇప్పుడు
ఎవరిలోనూ మచ్చుకైనా కనిపించడం లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధిలో నాయకత్వ పటిమ
లేదని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. అయినా ఆయన తప్ప ఆ పార్టీకు
దిక్కులేని దయనీయ స్థితి..! వంద కోట్ల భారతీయులను ఒక్కతాటిపై నడపడం
ఆనుకున్నoత ఆషామాషీ వ్యవహారం కాదు. దివంగత ఇందిరకున్న నాయకత్వ లక్షణాలు
సోనియాలో ఒక్కటి కూడా కనిపించవు. నెహ్రు నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్న
ఇందిరకు.. ఇటలీ నుంచి కోడలిగా వచ్చిన సోనియాకు నక్కకు... నాగలోకానికీ
ఉన్నంత తేడావుంది. ఇక.. నిన్న మొన్నటి వరకూ తల్లిచాటు బిడ్డగా పెరిగిన రాహుల్ ఒక్కసారిగా కాంగ్రెస్ వంటి మహావృక్షాన్ని చక్క దిద్దగలడనుకోవడం అత్యాసే..! ఆమాటకొస్తే రాష్ట్రంలో జగన్ కూడా అంతేకదా అనొచ్చు. జగన్ ఒక దశాబ్ద కాలంగా వ్యపార రంగంలో ఉన్నారు. తండ్రి అగస్మాత్ మరణంతో రాజకీయ వారసత్వాన్ని నేత్తికేత్తుకోక తప్పలేదు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన రాజశేఖర రెడ్డి మరణంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడానికి జగన్ కొత్త బాధ్యతలు చేపట్టారు. ఆయనలో పదవీకాంక్షకు
బీజం వేసింది కాంగ్రెస్ నాయకులే. అది మొక్కై.. మానై.. బలమైన ఆశయంగా
మారడానికి కారకులు కూడా వారే. జగన్ ఇప్పుడు రాజకీయ వట వృక్షంగా మారడంతో ఇటు
కాంగ్రెస్ కు..., అటు టిడిపి కి దిక్కుతోచడం లేదనడంలో సందేహంలేదు.
కాంగ్రెస్ రాజకీయాలతో విసిగెత్తిన జనం కొత్త తరంవైపు ఆశగా చూస్తున్నారని
యుపి ఎన్నికల ఫలితాలను చూస్తే.. అర్థం అవుతుంది. అలాగని సోనియా
వారసత్వాన్ని నేత్తినేక్కిoచుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. యూపిలో
అఖిలేష్ యాదవ్ ఆశాదీపంగా కనిపించారు. అంతేకాదు...రాష్ట్రాన్ని నాలుగు
ముక్కలు చేయమన్న మాయావతి డిమాండ్ ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. అతిపెద్ద
రాష్ట్రంగా ఉన్న యుపి ని ముక్కలు చేస్తే భరించలేమని జనం ముక్తకంఠంతో తీర్పు చెప్పారు. కాంగ్రెస్ మార్కు రాజకీయాలను ప్రజలు ఏవగించుకుంటున్నారనడానికి యుపి ఫలితాలే నిదర్శనం. ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఎప్పుడైనా ఇలాంటి ఫలితాలే ఇస్తాయనడంలో సందేహంలేదు. జనాన్ని నడిపించడమేకాదు... జనాభిప్రాయాన్ని
అర్థం చేసుకుని వారివెంట నడవడం కూడా నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఆపనే
ఇప్పుడు జగన్ చేస్తున్నారు. జనాభిప్రాయం మేరకు నడవలేకపోయినా చంద్రబాబు కు
రెండుసార్లు తిరస్కారం తప్పలేదు. ఇప్పటికీ ఆయన తీరు మారినట్లు
కనిపించడంలేదు. ఒకపక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన
స్థితిలో... సమర్థ ప్రతిపక్షం కూడా లేకపోవడంతో జనం జగన్ వైపు
చూస్తున్నారు. యుపి ఎన్నికల ఫలితాలు మన రాష్ట్ర నేతలకు చెంపపెట్టు. ఇదేతీరు
కొనసాగితే... యూపిలో అఖిలేష్ ను ఆదరించినట్టే ఏపిలోనూ జగన్ కు పట్టం కట్టడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. 2012 లో ఏం జరుగుతుందో చూద్దాం!-శివరాం

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి