17, ఫిబ్రవరి 2012, శుక్రవారం


రాష్ట్ర బడ్జెట్ రూ.1,45, 854 కోట్లు
రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 1,45,854 కోట్లతో 2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ. 20,008 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ. 4,444 కోట్ల అంచనాగా చూపించారు. జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2005-11లో రాష్ట్ర వృద్ధిరేటు 9.26 శాతంగా నమోదు అయిందని, దేశ వృద్ధిరేటు 8.5గా మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
 ---------------------------------------------------------------
రాష్ట్ర బడ్జెట్ ముఖ్య అంశాలు

2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ముఖ్య అంశాలు క్రింది విధంగా ఉన్నాయి.
వ్యవసాయ రుణాలు రూ.51020 కోట్లు, హోంశాఖ రూ. 4832 కోట్లు
రాజీవ్ యువకిరణాలు రూ. 777 కోట్లు, మత్స్యకారుల భీమాకు రూ. 234 కోట్లు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రూ. 151 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 4703 కోట్లు
వ్యవసాయం రూ.2572 కోట్లు, ఇంధనం, విద్యుత్ శాఖ రూ. 5937 కోట్లు
గ్రామీణ ఉపాథి కల్పన రూ.188 కోట్లు, పాల కమిషన్రూ. 100 కోట్లు
పశువుల వ్యాధి నిరోధకానికి రూ.50 కోట్లు, కార్మిక ఉపాధి శాఖ రూ.500 కోట్లు, క్రీడాభివృద్ధి రూ.220 కోట్లు
రవాణా, రోడ్లు, భవనాలు రూ.5032 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ రూ.2677 కోట్లు
పట్టణాభివృద్ధి రూ.6586 కోట్లు, సాంకేతిక విద్య రూ.1,087 కోట్లు, పట్టు పరిశ్రమ రూ.188 కోట్లు,
గృహ నిర్మాణ శాఖ రూ. 2302 కోట్లు,  సాధారణ పరిపాలన శాఖ రూ. 88 కోట్లు, పరిశ్రమలు రూ.633 కోట్లు
రచ్చబండ కార్యక్రమం రూ.1269 కోట్లు, గిరిజన సంక్షేమం రూ. 1540 కోట్లు, బీసీ సంక్షేమం రూ.3014 కోట్లు
మహిళ సంక్షేమ రూ.3014 కోట్లు, వికలాంగుల సంక్షేమం రూ.66కోట్లు,  మైనార్టీ సంక్షేమం రూ.489 కోట్లు
ప్రాథమిక విద్య రూ.15510 కోట్లు, సాంకేతి విద్య రూ.1087 కోట్లు, ఉన్నత విద్య రూ. 1841 కోట్లు
నీటి పారుదల రూ.15010 కోట్లు, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం రూ.5889 కోట్లు
ఆర్టీసీకి రాయితీ రూ.710 కోట్లు, ఒక్కో రైతుకు లక్ష వరకూ వడ్డీలేని రుణం
ఆరు జిల్లాల్లో కళారామాలు ఏర్పాటు, 1624 పీహెచ్సీల సామర్థ్యం పెంచటం., జిల్లాకో ఇండోర్ స్టేడియం 
                         -------------------------------------------------------------------
 ఎమ్మెల్యే పదవికి బోస్ రాజీనామా!
నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం చూపుతున్న వివిక్షకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం శాసనసభ్యుడు, మాజీ మంత్రి, వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ నాదెండ్ల మనోహర్ను ఆయన ఛాంబర్లో కలిసి శుక్రవారం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్పై గెలిచిన సుభాష్ చంద్రబోస్... ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆయనపై వేటు వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అనర్హత నిర్ణయం స్పీకర్ వద్ద పెండింగ్లో ఉంది. నేపథ్యంలో.. ఆయన తాజాగా రాజీనామా చేయడం గమనార్హం.
                            ---------------------------------------------------------------------------
  మార్చి 18 ఉప ఎన్నికలు
తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు స్థానానికి ఉప ఎన్నికలకు నగారా మోగింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానానికి కూడా మార్చి 18 తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఫలితాలు మార్చి 21 వెల్లడవుతాయిప్రస్తుతం ఖాళీగా ఉన్న మహబూబ్నగర్, నాగర్కర్నూల్, స్టేషన్ఘన్పూర్, కొల్లాపూర్, ఆదిలాబాద్, కామారెడ్డి, కోవూరు, అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మహబూబ్నగర్: రాజేశ్వర్రెడ్డి స్వతంత్ర సభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. ఆయన మరణంతో స్థానం ఖాళీ అయ్యిందినాగర్కర్నూలు: నాగం జనార్దన్రెడ్డి టీడీపీ నుంచి సస్పెండయ్యి, తర్వాత రాజీనామా చేశారు కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మంత్రి పదవి చేపట్టి, దానికి రాజీనామా చేసి తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. టీఆర్ఎస్లో చేరారు. స్టేషన్ఘన్పూర్: టి. రాజయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని రాజీనామా చేశారు. కామారెడ్డి: గంప గోవర్ధన్ టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆదిలాబాద్: జోగు రామన్న టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కోవూరు: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి టీడీపీ తరఫున గెలిచి జగన్ పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తూ పార్టీ నుంచి సస్పెండయ్యారు. పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హుడు కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది
-------------------------------------------------------------------

ఉప ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధం: సిఎం
ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం చెప్పారు. ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆదివారం పార్టీలో మరోసారి చర్చించి అధిష్టానానికి పంపిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని ఆరు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని కొవురూ నియోజకవర్గానికి ఈసి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు తాము నిధులు కేటాయిస్తున్నామని సిఎం చెప్పారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అవసరమైన చోట అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేదనటం వాస్తవం కాదన్నారు. ఉప ఎన్నికలు లేకుంటే కల్వకుర్తి నుంచి నీరు విడుదలయ్యేదని చెప్పారు. బడ్జెట్లో ఎక్కడా పన్నుల మాట రాలేదన్నారు.
------------------------------------------------------------------

నిత్యా మీనన్పై నిషేధం
హాట్ మలయాళీ కుట్టి నిత్యా మీనన్పై కేరళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిషేధం  విధించింది. ఆమెపై నిర్మాతలు నిషేదం విధించడానికి కారణం నిత్యామీనన్ తలపొగరు ప్రవర్తనే. ఇటీవల ప్రముఖ మలయాళీ నిర్మాత తన సినిమాలో నిత్యాను తీసుకోవాలనే విషయమై ఆమెతో మాట్లాడటానికి వెళ్లాడట. అయితే నిత్య మీనన్ అక్కడ ఉండి కూడా నిర్మాతను కలవకుండా తన మేనేజర్తో మాట్లాడాలని మెసేజ్ పంపిందట. ఒక్క నిర్మాత విషయంలోనే కాదు, చాలా మంది మలయాళీ నిర్మాతల విషయంలోనూ అమ్మడు ఇలానే తన పొగరుబోతు తనం ప్రదర్శిస్తోందట. దీంతో చిర్రెత్తిన నిర్మాతలంతా ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేసి నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా ఇతర దక్షిణాది సినిమా రంగాలైన తెలుగు, తమిళ, కన్నడంల్లోనూ నిత్య మీనన్పై బ్యాన్ విధించేలా ప్రయత్నాలు చేస్తున్నారట.
                                    ---------------------------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి